RS Praveen Kumar | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం ఉదయం నాగర్కర్నూల్లో గ్రానైట్ హమాలీలను ఆర్ఎస్పీ కలిశారు. ఈ సందర్భంగా హమాలీలతో కలిసి ఆర్ఎస్పీ గ్రానైట్ బండలను మోశారు.
అనంతరం ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. గ్రానైట్ బండలు మోయడం నిజంగా చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు. గ్రానైట్ బండలు మోసే హమాలీల సమస్యలను తెలుసుకున్నానని చెప్పారు. అత్యంత ప్రమాదంలో హమాలీల జీవితాలు ఉన్నాయని, వారి చేతులపై గాయాలను చూస్తే భయమేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా గెలిచిన వెంటనే గ్రానైట్ హమాలీల కోసం స్థానిక నాయకుల సహకారంతో ఒక ప్రత్యేక కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి, వాళ్లను గ్రానైట్ యజమానులుగా మార్చే ప్రయత్నం చేస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు.
ఈరోజు ఉదయం నాగర్ కర్నూల్ లో గ్రానైట్ హమాలీలతో కలిసి కొద్దిసేపు గ్రానైట్ బండలు మోశాను. ఇది నిజంగా చాలా కష్టమైన పని. హమాలీతో మాట్లాడి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను.వాళ్ల రోజూ జీవితాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. వీళ్ల చేతులపైన గాయాలను చూస్తే భయమేస్తున్నది.
ఈ కూలీలు రోజూ పెద్ద… pic.twitter.com/1EAFK1i2RH
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 17, 2024