శేరిలింగంపల్లి, జూన్ 24: తనపై అసత్య ప్రచారం చేస్తున్న తీన్మార్ మల్లన్న క్యూటీవీ, కాళోజీ టీవీ, జేఎస్ఆర్ టీవీ యూట్యూబ్ చానల్స్పై చర్యలు తీసుకోవాలని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి గచ్చిబౌలి పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఫేక్ ఆడియో తయారుచేసి దానిని వైరల్చేస్తున్నారని ఆరోపించారు.
తాను ముదిరాజ్ బిడ్డలని తిట్టినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తనకు ముదిరాజ్ కులం అన్న, ముదిరాజ్ బిడ్డలన్న గౌరవం ఉన్నదని అన్నారు. తన ఇష్ట దైవం పెద్దమ్మ తల్లి సన్నిధిలో ప్రమాణం చేస్తానని.. తప్పుడు ఆరోపణలు చేస్తున్న తీన్మార్ మల్లన్న, దాని వెనుక నుంచి నడిపిస్తున్న ఈటల రాజేందర్ ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.