MLC Kavitha | హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తమిళనాడు రాజధాని చెన్నైలో పర్యటించనున్నారు. ఏబీపీ నెట్వర్క్ సంస్థ నిర్వహించనున్న ‘ద సదరన్ రైసింగ్ సమ్మిట్’లో పాల్గొననున్నారు.
ఈ సమ్మిట్లో ‘సార్వత్రిక ఎన్నికలు 2024లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు?’ అనే అంశంపై గురువారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే చర్చ వేదికలో కవిత పాల్గొని తన అభిప్రాయాలను తెలియజేయనున్నారు. ఈ అంశంపై జరిగే చర్చలో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నమలై పాల్గొంటారు. ఈ చర్చా వేదికకు ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.