హైదరాబాద్ : ప్రముఖ వాణిజ్య సంస్థ అదానీ గ్రూప్పై ఇటీవలి అంతర్జాతీయ నివేదిక తర్వాత ఎల్ఐసీ, ఎస్బీఐ, ఇతర కంపెనీల షేర్లలో తగ్గుదల, ఒడిదుడుకులు సర్వత్రా తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నాయి అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. దీనిపై ప్రతీ భారతీయుడికి సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది, అన్ని సందేహాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సెబీ చీఫ్ మధాబి పూరిబుచ్, దిద్దుబాటు చర్యలు ప్రారంభించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. దీంతో పాటు దీని ద్వారా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన మిలియన్ల మంది పెట్టుబడిదారులు, వారిపై ఆధారపడిన కుటుంబాలతో ప్రభుత్వం తరపున మాట్లాడాలని కోరుతున్నాను అని కవిత పేర్కొన్నారు.