HomeTelanganaBrs Mlc Kavitha Attack On Congress Cm Revanth Reddy
MLC Kavitha | కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం అని కవిత అన్నారు.
MLC Kavitha | హైదరాబాద్ : కేసీఆర్ దమ్మెంతా అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ వచ్చింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరం అని కవిత అన్నారు. మహిళలకు రూ. 2500, పెన్షన్ల మొత్తం పెంపుపై ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు.
ఆరు గ్యారెంటీల అమలు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసంపై అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబును పిలిచి హైదరాబాద్ బిర్యాని పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్గా ఇచ్చారు. 2016లో పోలవరం, బనకచర్ల అంశమే లేదు. రేవంత్ రెడ్డికి అబద్దాలు ఆడడం అలవాటైంది. గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించడం సరికాదు. యస్.. అసెంబ్లీ పెడుదాం… ఆరు గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసినదానిపై చర్చిద్దామన్నారు కవిత. రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరించాలి. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు అని కవిత పేర్కొన్నారు.
ఇక ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు రాశారు. అబిడ్స్ జీపీవోలో ఎమ్మెల్సీ కవిత, జాగృతి కార్యకర్తలు పోస్ట్ కార్డులను పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. వృద్ధులకు రూ. 2 వేల పెన్షన్ను, రూ. 4 వేలు చేస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించింది. వికలాంగుల పెన్షన్ను రూ. 4 వేల నుంచి రూ. 6 వేలకు పెంచకుండా కాంగ్రెస్ మోసం చేసింది. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్న హామీ ఏమైంది..? గ్యారెంటీలపై సోనియా గాంధీ సంకతం పెట్టిన గ్యారెంటీ కార్డులను ఇంటింటికి పంచారు. సోనియాగాంధీ ముఖం చూసి ఓట్లేసిన మహిళలను, వృద్ధులను, వికలాంగులు మోసం చేశారు. అందుకే సోనియా గాంధీకి వేలాది పోస్టు కార్డులు పంపించాము. పెన్షన్ల మొత్తాన్ని పెంచాలని రేవంత్ రెడ్డికి ఆదేశాలివ్వాలని సోనియా గాంధీని కోరామని కవిత పేర్కొన్నారు.