Prashanth Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిపై బాల్కొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలవని జగ్గారెడ్డి.. మా ఎమ్మెల్యేలనే తీసుకెళ్తారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మా ఎమ్మెల్యేలను తీసుకెళ్లేంత మొగోళ్లు కాంగ్రెస్లో లేరు అని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి తమకేం అవసరం ఉందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. అలవిగానీ హామీలు ఇచ్చి తమపై నెపం నెడుతున్నారని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.