శంషాబాద్ రూరల్, జనవరి 28: నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్రెడ్డిని కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్గౌడ్ స్పష్టంచేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని రేవంత్రెడ్డి నివాసంలో సీఎంను ఎమ్మెల్యే కలువగా, ప్రకాశ్గౌడ్ పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంను కలిశానని స్పష్టంచేశారు. శంషాబాద్ మండలంలోని కొత్వాల్గూడ, బహదూర్గూడ, ఘాన్సిమియాగూడ గ్రామాల్లోని భూ సమస్యలను పరిష్కారం చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని కోరినట్టు వివరించారు. దీనిపై సీఎం సానుకులంగా స్పందించిన్నట్టు తెలిపారు.