Rythu Bandhu | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రైతులను అవమానించిన కాంగ్రెస్ ప్రభుత్వం బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 దఫాలుగా అత్యంత పారదర్శకంగా రైతులకు రైతుబంధు డబ్బులు వేశామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అది లోపించిందని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సీనియర్ నేత మహేశ్వర్రెడ్డి తదితరులతో కలిసి నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల సమయంలో రైతులను కాంగ్రెస్ మోసం చేసింది. ఎన్నికలు అయిపోగానే ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పా టు కాగానే డిసెంబర్ 9 నుంచి రైతుబంధు ను ఎకరానికి రూ.15 వేల చొప్పున వేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఇస్తామని చెప్పారు. వాళ్ల ప్రభుత్వం ఏర్పడి 27 రోజు లు అవుతున్నా ఇంకా వాటి ఊసేలేదు. రైతుల కష్టాలు తెలిసిన బీఆర్ఎస్ ప్రభు త్వం బాధ్యతగా రైతుబంధుకు నిధులు సేకరించి, రైతులకు వేయాలని సిద్ధపడితే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? మేం సిద్ధం చేసిన సొమ్మును ప్రభుత్వం ఏర్పడగానే ఇవ్వాల్సిందిపోయి కాలయాపన చేయటంలో ఆంతర్యం ఏమి టి? ఆ నిధులు ఎక్కడికి పోయాయి? ఇప్పటివరకు ఒక్క ఎకరం ఉన్న రైతులకు కూడా రైతుబంధు పడలేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం 11 దఫాల్లో రూ.72,815 కోట్లను రైతులకు రైతుబంధు రూపంలో అందించిందని గుర్తుచేశారు. ఎంతమందికి రైతుబంధు వేశాం? ఎన్ని ఎకరాలలోపు వారికి ఇచ్చాం? అనేది వ్యవసాయశాఖ నుంచి ఏ రోజుకు ఆ రోజు అన్ని వివరాలను అందించామని, ఇప్పుడు ఆ పారదర్శక ఏది? అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటు జరిగినా ఒంటికాలిపై లేచిన కొంతమంది మేధావులు ఇప్పు డు రైతుల సమస్యలపై ఎందుకు మాట్లాడటంలేదని నిరంజన్రెడ్డి ప్రశ్నించారు. రైతులంతా పెట్టుబడిసాయం కోసం ఎదురుచూస్తుంటే, కుంటిసాకులతో కాలయాపన చేస్తున్న ఈ సర్కారును ఎందుకు ప్రశ్నించ టం లేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేయటమే కాకుండా అవమానించిందని మండిపడ్డారు. ఇందు కు ప్రభుత్వం బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యానికి కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలు కు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన కాం గ్రెస్, ఎంతమంది రైతులకు బోనస్ ఇచ్చిందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పటయ్యాక నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. ప్రజలకు సన్నబియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మార్కెట్లో ధరలను నియంత్రించటంలో విఫలమైందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్పై కక్షసాధించాలనే కుతూహలాన్ని మాని పాలనపై దృష్టిసారించాలని సూచించారు.
బీఆర్ఎస్ బాధ్యతగల పార్టీ అయితే కాంగ్రెస్ బాధ్యతారాహిత్య పార్టీ అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. నమ్మి ఓటేసిన ప్రజలను ఆ పార్టీ ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి తేరుకొని లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం తిరిగి సన్నద్ధం అవుతున్నారని సమీక్షా సమావేశాలు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్లవారీగా నిర్వహిస్తున్న సమీక్షల్లో పార్టీ శ్రేణులు విలువైన సూచనలు చేస్తున్నాయని తెలిపారు. అందరి అభిప్రాయాల ను పరిగణనలోకి తీసుకొని ముందుకు పోతామన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీదే ఘన విజయమని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి లక్షకు పైగా ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో తెలంగాణ వాదం వినిపించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ అజెండాతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు, కాంగ్రెస్కు 1.85 శాతం ఓట్లు మాత్రమే తేడా ఉన్నదని గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తమకు ఒక పాఠం లాంటిదన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడానికి కనీసం వంద రోజు ల సమయం ఇవ్వాలని భావించామని, ప్రభుత్వం వాటిని అమలు చేయ డం మాని బీఆర్ఎస్పై బురదజల్లటమే పనిగా పెట్టుకోవటంతో తాము మాట్లాడాల్సి వస్తున్నదని తెలిపారు.