హైదరాబాద్ : రాజకీయాల్లో అర్వింద్ ఓ కుసంస్కారి అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, యెగ్గె మల్లేశంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. నిజామాబాద్ నికమ్మ అర్వింద్ అన్నారు. ఎంపీ అర్వింద్ అబద్ధాల విందు అని, కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అర్వింద్కు లేదన్నారు. డీఎస్పై కేటీఆర్ గౌరవంగా మాట్లాడితే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. అర్వింద్ తండ్రికి పదవి ఇచ్చి జీతంఇచ్చి సాధించి సీఎం కేసీఆరే అర్వింద్ తాగే నీళ్లు కేసీఆర్వేనన్నారు. నడిచే రోడ్డు కేసీఆర్ వేసిందేనన్నారు. కేటీఆర్ దావోస్కు వెళ్లి ఏం చేశారో అర్వింద్కు తెలియదా? ప్రశ్నించారు.
దావోస్లో 52 మీటింగ్లు పెట్టి రూ.21వేలకోట్ల పెట్టుబడులు సాధించింది కేటీఆర్ కాదా? అని నిలదీశారు. ఐటీ గురించి అర్వింద్లాంటి లూటీగాళ్లకు ఏం తెలుసునన్నారు. అబద్ధాలు మాట్లాడితే అర్వింద్ నాలుక చీరేస్తామన్నారు. కేటీఆర్ ఐటీ, పరిశ్రమల మంత్రిగా 96వేల పరిశ్రమలు తెచ్చి 16లక్షల మందికి ఉపాధి కల్పించారన్నారు. ఇలాంటి నిజాలు ఫేక్ డిగ్రీ ఉన్న అరవింద్కు ఎలా అర్థమవుతాయా? అని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధిపై చర్చకు వస్తావా? నేను సిద్ధమన్నారు. కళ్లుండి అర్వింద్ అభివృద్ధిని చూడలేకపోతున్నారన్నారు. నిజామాబాద్ అభివృద్ధిలో కేంద్రం వాటా నయాపైసా ఉందా? అని నిలదీశారు. ఆర్మూర్ నియోజకవర్గానికే రూ.2500కోట్ల కేటాయించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.
కరెంటు లేదంటున్న ఆయన.. ఓసారి కరెంటు తీగలను పట్టుకోవాలన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే ప్రజలే అర్వింద్కు బుద్ధి చెబుతారన్నారు. అర్వింద్పై తిరగబడ్డ స్థాయిలో ఏ ఎంపీపై ప్రజలు తిరగబడలేదన్నారు. చర్చకు వస్తే డేటాతో తాట తీస్తామన్నారు. దుర్మార్గుల పార్టీలో చేరిన ఈటల కేసీఆర్ పాలనపై విమర్శలు చేస్తున్నారని.. హుజూరాబాద్లో ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నందిపేటలో సర్పంచ్ దంపతుల ఆత్మహత్య యత్నం బీజేపీ కుట్ర అని, బిల్లులు రాలేదనే కారణంతో ఆందోళన చేయలేదన్నారు.
బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందని, మాజీ సీఎంలు, మాజీ ఎంపీలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. అదానీ మరో హర్షద్ మెహతాలా మారారన్నారు. ఎమ్మెల్సీ గంగాధర్ ఎంపీగా నిజామాబాద్కు చిల్లిగవ్వ తేలేదని, పసుపు బోర్డు తెస్తానని అర్వింద్ మోసం చేశారని ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ విమర్శించారు. అర్వింద్కు దమ్ముంటే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు సాధించి చూపాలని, కనీసం నవోదయ స్కూల్ కూడా తేలేని అసమర్థ ఎంపీ అర్వింద్ అని మండిపడ్డారు. నిజామాబాద్లో ఈటల వ్యాఖ్యల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఈటలకు రాజకీయ భిక్షపెట్టింది కేసీఆర్ అని, అది మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.