Harish Rao | హైదరాబాద్ : హర్యానా ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయని హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడిందని హరీశ్రావు తెలిపారు.
ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రతీకార రాజకీయాలు, దృష్టి మళ్లింపు రాజకీయాలు మానుకొని, ఆరు గ్యారెంటీలను, 420 హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. కశ్మీర్లో బీజేపీని విశ్వసించలేదు.. హర్యానాలో కాంగ్రెస్ను విశ్వసించలేదు. రెండు జాతీయ పార్టీల పట్ల ప్రజల్లో విముఖత ఉన్నదనేది సుస్పష్టం అని హరీశ్రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ గ్యారెంటీల గారడీని హర్యానా ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు తేల్చి చెబుతున్నాయి.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేసిన మోసాన్ని హర్యానా ప్రజలు నిశితంగా గమనించారు. ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనబడింది.
ఈ ఫలితాలు చూసిన తర్వాత అయినా రేవంత్ రెడ్డి…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ గ్యారెంటీలు అబద్దమని హర్యానా ప్రజలు గ్రహించారు : కేటీఆర్
Harish Rao | ఆ వీడియోలో తప్పేముంది..? జర్నలిస్ట్ గౌతమ్ను వెంటనే విడుదల చేయాలి : హరీశ్రావు