హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించకుండా ప్రభుత్వం మె డలు వచ్చి వెనక్కి తగ్గేలా చేయడంలో బీఆర్ఎస్ విజయం సాధించిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండ సభతోపాటు పార్టీ వివిధ రకాలుగా చేసిన పోరాటం వల్లే ప్రాజెక్టుల అప్పగింతలో సర్కారు వెనక్కి తగ్గిందని తెలిపారు. సమావేశాల్లో ప్రభుత్వం ఎంతసేపూ ప్రతిపక్షంపై దాడిచేసే ధోరణితోనే వ్యవహరించిందని విమర్శించారు. ప్రాజెక్టులపై తప్పులతడకగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని మండి డ్డారు. సభలో తమకు వాస్తవాలు చెప్పే అవకాశం ఇవ్వలేదని, కాబట్టి త్వరలోనే వాటిని మీడియాకు వెల్లడిస్తామని తెలిపారు.
కాగ్ నివేదికను తప్పుబట్టింది కాంగ్రెస్సే
కాగ్ నివేదికను తాము తప్పుబట్టలేదని, వివిధ సందర్భాల్లో అప్పటి ముఖ్యమంత్రులు రాజశేఖర్రెడ్డి, కిరణ్కుమార్రెడ్డి తప్పుబట్టిన విషయాన్నే గుర్తుచేశామని పేర్కొన్నారు. గతం లో బీఆర్ఎస్ పనితీరును కాగ్ మెచ్చుకున్న విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహితలో జరిగిన టెండర్ల అంశాన్నే కాగ్ తప్పుబట్టినట్టు చెప్పా రు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధికోసమే ప్రభు త్వం శ్వేతపత్రాలను విడుదల చేసిందని, సభను అందుకే వాడుకున్నదని దుమ్మెత్తిపోశారు.
గొంతునొక్కే ప్రయత్నం
కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చింది, కరెంటు ఇచ్చింది, పంటలు పండింది ముమ్మాటికి నిజమని హరీశ్ పేర్కొన్నారు. సంఖ్యాబలం ఉందికదా అని తమ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. తాను మాట్లాడితే వారి తప్పిదాలు బయటకు వస్తాయనే సభలో తనను పదేపదే అడ్డుకొనే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.
రాయలసీమకు, పోతిరెడ్డిపాడు కు నీళ్లు ఆపడానికి సెక్షన్-3 ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఆరు నెలల్లో ట్రిబ్యునల్లో నీటి కేటాయింపులు జరిగేలా బలమైన వాదనలు వినిపిస్తే కృష్ణా జలాల్లో ప్రస్తుతం ఉన్న 299 టీసీఎంలకు బదులు 600లకు పైగా టీఎంసీలు దక్కించుకునే అవకాశం ఉంటుందని, దీనిపై దృష్టి పెట్టాలని కోరారు. పోలీస్ నియామకాల పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది తామేనని, కానీ రేవంత్రెడ్డి ని యామకపత్రాలు అందించి దానిని తమ ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి
పాలమూరు-రంగారెడ్డికి 90 టీఎంసీలు కేటాయించి కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీకి తాము డీపీఆర్ పంపించి అనుమతులు అడిగినట్టు హరీశ్రావు గుర్తుచేశారు. ఇప్పటికే ఆరు అనుమతులు వచ్చాయని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఈఏసీ కూడా కేంద్రానికి ప్రతిపాదించిందని తెలిపారు. ఈఏసీ ప్రతిపాదించిన దానికి కేంద్రం కచ్చితంగా అనుమతులు ఇస్తుందని, అదేదో తొందరగా వచ్చేలా కేంద్రంతో మాట్లాడాలని కోరారు. అనుమతులొస్తే పంట కా ల్వ లు తవ్వి రైతులకు నీళ్లు ఇవ్వొచ్చని చెప్పారు.
సిద్దిపేటను విమర్శించడం ఫ్యాషన్
తన నియోజకవర్గం సిద్దిపేటను విమర్శించ డం అందరికీ ఫ్యాషనైందని హరీశ్ మండిపడ్డా రు. అక్కడ ప్రజలు లేరా? రైతులు లేరా? అని ప్రశ్నించారు. సింగూరు నీళ్లు సిద్దిపేటకు పోవ ని, నిజాంసాగర్కు వెళ్తాయని కాంగ్రెస్ ఎమ్మె ల్యే సంజీవరెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్గా చెప్పా రు. అప్పట్లో నిజామాబాద్ జిల్లాలో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంటే అప్పటి స్పీకర్ పో చారం కోరిక మేరకు బోదన్తోపాటు మరో 2-3 నియోజకవర్గాలకు నీళ్లిచ్చినట్టు తెలిపారు.
రైతాంగానికి అన్యాయం చేయొద్దు
రాజకీయంగా తమపై బురద చల్లాలనుకుంటే చల్లాలని, కానీ వర్షాకాలం లోపే మేడిగడ్డకు మరమ్మతులు చేసి రైతాంగానికి అన్యాయం జరగకుండా చూడాలని హరీశ్ కోరారు. శ్వేతపత్రం పేరుతో తమను ఇరికించబోయి ప్రభుత్వం బొక్కబోర్లాపడిందని విమర్శించారు. ఆయకట్టు స్థిరీకరణపై వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం విజయాలను శ్వేతపత్రంలో తక్కువ చేసి చూపించారని, క్షమాపణలు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు సాధించేందుకు చిన్నచిన్న అంశాలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గ్యారెంటీలు అమలు చేయలేక మేడిగడ్డ అంటున్నారని, రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకుంటే పుట్టగతులు లేకుండా పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.