MLA Gadari Kishore | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి( Ravanth Reddy ) చేస్తున్నది పాదయాత్ర కాదని.. కాంగ్రెస్( Congress Party )కు పాడే కట్టే యాత్ర అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్( MLA Gadari Kishore ) అన్నారు. సీఎం కేసీఆర్( CM KCR ) పై కానీ బీఆర్ఎస్( BRS Party )పై కానీ తప్పుడు, నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు రేవంత్ రెడ్డిని బట్టలూడదీసి కొట్టే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు. మంగళవారం ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ రావు, నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్లతో కలిసి ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి వృత్తి బ్లాక్ మెయిలర్ అని, ఆయన రాజకీయ వ్యభిచారి, బ్రోకర్ అంటూ విమర్శించారు. సచివాలయం( Secretariat ), అమర వీరుల స్మారక కేంద్రం, బీఆర్ అంబేడర్ విగ్రహ నిర్మాణంలో అవినీతి అంటూ ఆధారాలు లేకుండా మాట్లాడారని, తప్పుడు ఆరోపణలు, నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు, సమాజం సహించదని, చెప్పులతో బుద్ధి చెపుతుందన్నారు. సమాచార హక్కు చట్టాన్ని బ్లాక్ మెయిలింగ్కు వాడుకునే రేవంత్, ఇప్పుడు కూడా వీటిపై సమాచారం తీసుకోవచ్చు అంటూ ఆయన హితవు పలికారు.
తెలంగాణ అమరవీరుల గురించి మాట్లాడే హక్కు రేవంత్కు ఎక్కడిదంటూ ప్రశ్నించారు. తెలంగాణ అమరవీరులకు కారణం రేవంతే అని, ఆనాడు ఉద్యమంలో పాల్గొనకుండా రెండు కళ్ల చంద్రబాబు సంకలో జొర్రిన వ్యక్తి రేవంత్ అని కిషోర్ గుర్తు చేశారు. పెయింటర్గా జీవితం ప్రారంభించిన రేవంత్కు ఇన్ని ఆస్తులు ఎక్కడివంటూ నిలదీశారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి( Minister Prashanth reddy )ని అవినీతిపరుడని విమర్శిస్తావా, ప్రశాంత్ రెడ్డి గురించి వాళ్ళ నాన్న సురేందర్ రెడ్డి గురించి నిజామాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. స్టీల్ బలమైనది వాడటం, పునాది తవ్వే సమయంలో నీళ్లు రావడం, తదితర సాంకేతిక పరమైన సాంకేతిక కారణాలతో అంచనా వ్యయం పెరిగిందన్నారు. అంత మాత్రానా అవినీతి జరగడం అనడాన్ని ఆయన తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. కేసీఆర్ పాలనలో అవినీతికి చోటే లేదని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీతో, మల్లికార్జున ఖర్గేతో ఎప్పుడైనా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించే ప్రయత్నం చేశావా..? అంటూ రేవంత్ను ప్రశ్నించారు. రేవంత్ పిచ్చి ప్రేలాపనలు చేస్తే తన్ని తరిమేస్తారని హెచ్చరించారు. రేవంత్ ను మించిన పొలిటికల్ బ్రోకర్ ఎవ్వరూ లేరన్నారు. తస్మాత్ జాగ్రత్త, కేసీఆర్ పాలనపై మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని ఆయన సూచించారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని అన్నారు.