Minister Jagadish Reddy |హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీని నమ్మితే అంధకారం రాజ్యమేలుతుందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. కర్ణాటకలో వ్యవసాయానికి 2 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని దుస్థితి ఆ పార్టీది అని, అక్కడి రైతులు ధర్నాలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ రైతులు గమనించాలని సూచించారు. ఆదివారం తెలంగాణ భవన్లో విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ నేత రాజారాంయాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ను నమ్మితే కర్ణాటక పరిస్థితులు ఇక్కడ వస్థాయని హెచ్చరించారు.
బెంగళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లో కరెంటు కోతలు ఉన్నాయని తెలిపారు. రైతులు సబ్స్టేషన్లలో మొసళ్లను వదిలి నిరసన తెలుపుతున్నారని వివరించారు. అకడ నిరంతరాయంగా 5 గంటల కరెంటు కూడా ఇవ్వలేని కాంగ్రెస్.. ఇకడ ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఓటేస్తే 2014కు ముందు పరిస్థితులు వస్తాయని గుర్తుచేశారు. ఛత్తీస్గఢ్లో మిగు లు విద్యుత్తు ఉన్నా, ఇతర రాష్ర్టాలకు అమ్ముకుంటున్నారు కానీ, రైతులకు 7 గంటలే ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ రాష్ర్టాల్లోనూ ఇదే దుస్థితి ఉన్నదన్నారు.
తెలంగాణలో సెప్టెంబర్లో అంచనాకు మించి విద్యుత్తు డిమాండ్ ఏర్పడితే సీఎం కేసీఆర్ రైతులకు ఇబ్బంది లేకుండా చూశారని మంత్రి గుర్తుచేశారు. కర్ణాటకలో సగం ఉన్న తెలంగాణలో 15 వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ను తీర్చగలుతున్నామని వివరించారు. మేడిగడ్డ బ్రిడ్జిపై ప్రభుత్వం నిపుణులతో విచారణ చేయిస్తుందని స్పష్టం చేశారు. జానారెడ్డి మంత్రిగా ఉన్నపుడు హైదరాబాద్లోని ఆయన నివాసంలో రాత్రి పూట కూడా జనరేటర్ల అవసరం ఉండేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని చెప్పారు. వయసుతో పాటు జానారెడ్డి అబద్ధాలు పెరుగుతున్నాయని చురక అంటించారు.