హైదరాబాద్: లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సన్నద్ధమవుతున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ప్రతీ రోజు ఒక పార్లమెంటు నియోకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్లో కరీంనగర్ (Karimnagar) లోక్సభ సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు నేతృత్వంలో జరుగుతున్న ఈ సమావేశానికి లోక్సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు పార్టీ కేడర్ను సమాయత్తం చేసి, వారి సలహాలు స్వీకరించడంపై చర్చిస్తున్నారు.
మొదటి రోజైన బుధవారం ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోని నేతలతో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో లిఖిత పూర్వక సూచనలు, సలహాలు స్వీకరించారు. దాదాపుగా 26 మందికి పైగా మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలిపారు. సన్నాహక సమావేశంతో పార్టీ కేడర్తో నూతనోత్సాహం నెలకొంది.