మేడ్చల్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): అధిష్ఠానం ఆదేశిస్తే మ ల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అ నుభవం ఉన్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే తరహలో ప్రజలు బీఆర్ఎస్ను అదరిస్తారు.
రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంటుంది’ అని ఆయ న తెలిపారు. పార్టీ అధిష్ఠానం ఇప్పటికే ఎంపీ స్థానాల గెలుపుపై ఫోకస్ చేసిందని, లోక్సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నట్టు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయంపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ నెల 21 తెలంగాణభవన్లో మల్కాజిగిరి పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.