మారేడ్పల్లి, ఫిబ్రవరి 26: టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ల అభివృద్ధికి సహకారం అందిస్తానని బీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి భరోసా ఇచ్చారు.
హైదరాబాద్లోని బోయిన్పల్లిలో నిర్వహించిన టైప్ రైటింగ్, షార్ట్హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ (టీఆర్టీఎస్ అండ్ సీఏ) సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ ఇన్స్టిట్యూట్ సమస్యలను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.