Rythu Sangrama Sadassu | రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలికావద్దని.. గుండె ధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతు సోదరులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని తెలిపారు. రెండేళ్లలో రాబంధు రాజ్యం పోయి.. రైతుబంధు కేసీఆర్ రాజ్యం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రైతు సంగ్రామ సదస్సులో రైతుల పక్షాన నాలుగు తీర్మానాలు చేస్తున్నామని ప్రకటించారు.
1. కాంగ్రెస్ రాబంధు పాలనలో వెయ్యి మందికిపైగా రైతులు చనిపోయారని.. రోడ్డున పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
2. వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ఇచ్చిన 34 హామీలను వెంటనే అమలు చేయాలి.
3. అన్ని పంటలను ఆంక్షలు లేకుండా రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేయాలి.
4. రెండు లక్షల రుణమాఫీ పూర్తి కాని రైతులకు రుణ విముక్తి కల్పించాలి. రైతుబంధు సక్రమంగా వేయాలి. రైతు బీమా పథకాలను వెంటనే పునరుద్ధరించాలి.
రైతు సంగ్రామ సదస్సులో చేసిన తీర్మానాలను కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా
దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, రెండేళ్లలో వచ్చేది మన ప్రభుత్వమే
1)కాంగ్రెస్ పాలన వల్ల బలైన రైతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి ఆదుకోవాలి
2)రైతు డిక్లరేషన్ లోని హామీలు అమలు చేయాలని
3)అన్ని పంటలను ఆంక్షలు లేకుండా కొనాలి… pic.twitter.com/ZZ5bjiAVGI— Telugu Scribe (@TeluguScribe) May 6, 2026