హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆయిల్పామ్ రైతులు ఎదురొంటున్న గిట్టుబాటు ధర సమస్యలను కేంద్రప్రభుత్వం దృష్టి కి తీసికెళ్లి పరిషరించేందుకు ప్రయత్నిస్తానని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు భరో సా ఇచ్చారు. తెలంగాణ ఆయిల్పామ్ ఫార్మర్స్ వె ల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఆయిల్పా మ్ రైతు ప్రతినిధులు శుక్రవారం హైదరాబాద్లో ఆయనను కలసి వినపతి పత్రం అందజేశారు.
ఆయిల్పామ్ ఉత్పత్తి వ్యయం పెరిగి, గిట్టుబాటు ధర పడిపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ నామా దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందిస్తూ.. ఆయిల్పామ్ రైతుల సమస్యలపై కేంద్రంతో చర్చిస్తానని ఎంపీ నామా హామీ ఇచ్చారు. ఆయిల్పామ్ పంటను ప్రవేశపెట్టినప్పుడు లాభదాయకమైన ధరను అందజేస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం.. ఆ తర్వా త దాన్ని విస్మరించిందని, అందుకే ఆయిల్పామ్ రైతులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారని ఎంపీ నామా పేర్కొన్నారు.