హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నాయకుల దాడులు నిత్యకృత్యంగా మారాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దాడులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోకపోతే ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు డీజీపీ రవిగుప్తాకు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు.
ఆయా ప్రాంతాల్లోని బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం, వారి ఆస్తులను ధ్వంసం చే యడం, కార్యకర్తలను బెదిరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉమ్మడి నల్లగొండలో కాంగ్రెస్ నేతల తీరు దా రుణంగా ఉన్నదని మండిపడ్డారు. ఇటీవల హుజూర్నగర్ పరిధిలోని చింతలపాలెం మం డలం కిష్టాపురంలో జడ్పీటీసీ, ఎంపీటీసీలపై దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. మఠంపల్లి మండలంలో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడిపై, అతని వ్యవసాయ మోటర్లు తదితర ఆ స్తులు ధ్వంసం చేశారని మండిపడ్డారు.
భూపాలపల్లి, మానకొండూరు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో భౌతిక దాడులు, హత్యలు, హత్యా యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాజా గా మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో, ఆయన రెచ్చగొట్టడం వల్ల భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డిని దుర్భాషలాడి, దాడికి పా ల్పడి, సమావేశం నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు గెంటి వేయడం దారుణమని తెలిపారు.
సందీప్రెడ్డిపై దాడి జరుగుతుంటే పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరమని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనిన్నారు కార్యక్రమంలో నల్లగొండ జడ్పీ చైర్పర్సన్లు బండా నరేందర్రెడ్డి, గుజ్జా దీపిక, తీ గల అనిత, మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్రావు, పైళ్ల శేఖర్రెడ్డి, కోరుకంటి చందర్, శానంపూడి సైదిరెడ్డి, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు రావుల శ్రీధర్రెడ్డి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
అహంకారికి తగిన బుద్ధి చెప్తాం
ఇది నాపై జరిగిన దాడి కాదు. రాజ్యాంగంపై జరిగిన దాడి. మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు. ఇక నుంచి నాయకులపై కాదు కదా.. కార్యకర్త మీద దాడులు జరిగినా ఉపేక్షించబోం.
– ఎలిమినేటి సందీప్రెడ్డి, జడ్పీ చైర్మన్, యాదాద్రి భువనగిరి జిల్లా