హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టెండర్ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్కామ్ స్టార్ రేవంత్ రోజుకో నకిలీ సంస్థను రాష్ర్టానికి తెస్తూ హర్షద్ రేవంత్ మెహతాగా మారారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీనేత వాసుదేవరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మెయిన్హార్ట్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి కూడా అదే సంస్థకు మూసీ అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉన్న సంస్థకు మూసీ ప్రాజెక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఝార్ఖండ్లో ఆ సంస్థ రూ. 16 కోట్లు దుబారా చేసినట్టు కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. కేటీఆర్, హరీశ్రావుపై మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కిరాయి గూం డాలతో తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఏం చదువుకున్నారో ఎవరికీ తెలియదని, ఎన్నికల అఫిడవిట్లో ఒక్కోసారి ఒక్కోలా పేర్కొన్నారని విమర్శించారు. ఆయన కొడుకు ఏ డాక్టరో తెలియదని, పిచ్చిగా ప్రవర్తిస్తున్న తన తండ్రికి చికిత్స చేసుకోవాలని క్రిశాంక్ సూచించారు.