మేడ్చల్ మల్కాజిగిరి, డిసెంబర్ 4 : మేడ్చల్ ప్రజల రుణం తీర్చుకోనిలేదని, మేడ్చల్ను మరింత అభివృద్ధి చేస్తానని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Former minister Mallareddy) అన్నారు. సోమవారం జవహర్నగర్ కార్పొరేషన్కు చెందిన తెలంగాణ ఉద్యమకారులు మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే మల్లారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. మేడ్చల్ ఎమ్మెల్యేగా తనను మరోసారి గెలిపించారని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో కొండల్ ముదిరాజ్, సుధాకర్చారి, సింగన్న బాల్రాజ్, ఎల్లస్వామి, ప్రకాశ్, పరశురామ్, భాస్కర్, నర్సింహా, పృధ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.