వేములవాడ/జ్యోతినగర్/దేవరకద్ర/కొత్తకో ట, ఫిబ్రవరి 6: ముఖ్యమంత్రి రేవంత్పై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. గులాబీ బాస్ కేసీఆర్పై రేవంత్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగాయి. ఖబడ్దార్ రేవంత్ అంటూ నినాదాలు హోరెత్తాయి. సీఎం హోదాను మరిచి గల్లీ లీడర్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలన చేతగానీ కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గ్యారెంటీలను అమలు చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని పాత సింధూర ఇంజినీరింగ్ కళాశాల రోడ్డులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణచౌక్లో బీఆర్ఎస్ యువజన నాయకులు రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.