Telangana Assembly Elections | రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్ గెలుపొందారు. 31,844 ఓట్ల మెజార్టీతో ప్రకాశ్ గౌడ్ గెలుపొంది, బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డిని మట్టి కరిపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రకాశ్ గౌడ్కు 1,19,647 ఓట్లు, బీజేపీకి 87,803 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 80,407 ఓట్లు పోలయ్యాయి. రాజేంద్రనగర్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో సంబురాల్లో మునిగిపోయారు.