Manne Krishank | హైదరాబాద్ : లోక్సభ ఎన్నికలను నడిపిస్తున్నది ఈసీ కాదు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) అని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
లోక్సభ ఎన్నికల సమయంలో కవితను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఎన్నికల సమయంలో ఒత్తిడికి గురి చేయాలనే ఉద్దేశంతో అరెస్టు చేశారు. తెలంగాణకు ఏం చేయలేదనే విషయాన్ని బయటకు రానివ్వకుండా, ఎవర్నీ అడగనివ్వకుండా మోదీ చేశారు. ఇవాళ మీడియాలో మొత్తం ఈడీ, సీబీఐ అరెస్టులపైనే చర్చ జరుగుతుందన్నారు.
కశ్మీర్ నుంచి కేరళ వరకు ఈడీ, సీబీఐ కేసులతో మోదీ ప్రతిపక్షాలను భయపెట్టిస్తున్నారని మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు. ఆప్ నాయకుడు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ, పంజాబ్లో ఇదే చర్చ. ఆప్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోతోంది. నిన్న కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తెకు ఈడీ నోటీసులు జారీ చేశారు. ఆర్జేడీ నాయకుడి మీద ఈడీ దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేన అభ్యర్థి నామినేషన్ వేసిన కొద్ది గంటల్లోనే ఈడీ నోటీసులు వచ్చాయి. తమిళనాడులో డీఎంకే నాయకుడు రాజా మీద పాత కేసులో సీబీఐ వారు చాలెంజ్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కూడా మళ్లీ తిరిగి కేసులను బయటకు తీసుకొస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాపై కూడా ఈడీ నోటీసులు.. ఒక వైపు ఎన్నికల ప్రచారాం చేయాలా..? మోదీ విచారణలో పాల్గొనాలా..? ఈడీ వాళ్లేమో ఢిల్లీకి రావాలని పిలుస్తున్నారు. సమయం వృథా చేయాలని మోదీ చేస్తున్నారు. కశ్మీర్లో ఫారుక్ అబ్దుల్లాకు కూడా ఈడీ నోటీసులు జారీ చేశారు. కశ్మీర్ నుంచి మొదలుకుంటే కేరళ వరకు ఈడీ నోటీసులే. డజన్కు పైగా రాష్ట్రాల్లో ఈడీ కేసులు, దర్యాప్తులు.. లోక్సభ ఎన్నికలు నడుస్తుంటే.. ఈడీ, సీబీఐలపేనే చర్చ తప్ప.. మోదీ పాలనపై చర్చ లేదు. ఈ పదేండ్లలో రైతులు, పేదలను మోదీ పట్టించుకోలేదు అని మన్నె క్రిశాంక్ ధ్వజమెత్తారు.
బండి సంజయ్ 10వేల కోట్ల అవినీతి అంటాడు, ఈడీ నేమో 100 కోట్ల స్కాం అంటుంది. సుజనా చౌదరీ 6000 కోట్ల బ్యాంక్ స్కాం అని చెప్పిన ఈడీ.. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. వారికీ లొంగితే అరెస్ట్లు, ఈడీ దాడులుండవు. ఎవరు ప్రచారం చేయద్దు.. ఈడీ ఆఫీసుల చుట్టూ తిరగాలి. సమస్యల గురించి ఎన్నికల్లో చర్చకు రాకుండా ఉండాలని ఈడీ దాడులు చేస్తున్నారు అని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. మా నాయకుడుని ప్రచారం చేయనీయకుండా చేయాలని చూస్తున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రజలుకు అన్నీ వివరిస్తాం. బీజేపీ ఓడిపోనుంది అందుకే రాష్ట్రాలలో ఉన్న నాయుకులు పైన దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మన్నె క్రిశాంక్.