హైదరాబాద్ : బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను( Manne Krishank) పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, బషీర్బాగ్ ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్కు భారీ ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
కాగా, ఫార్ములా-ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈడీ విచారణకు హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఈ నెల 7న విచారణకు కేటీఆర్ హాజరవాల్సి ఉన్నది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసిన నేపథ్యంలో.. తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో 16న విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరయ్యారు.
ఈడీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతుండగా బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ను అరెస్టు చేసిన పోలీసులు pic.twitter.com/vE0FibVMrG
— Telugu Scribe (@TeluguScribe) January 16, 2025