Hairsh Rao | నిజామాబాద్లో ఆటో డ్రైవర్ దంపతుల ఆత్మహత్యపై హరీశ్రావు స్పందించారు. ఆటో నడవడం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను కోల్పోయి, అనాథగా మారిన ఆ బిడ్డ భవిష్యత్కు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు భరోసా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వరుసగా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వీడి, ప్రభుత్వం వెంటనే ఆటో డైవర్ల జీవన సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. 12 వేల భృతి ప్రకటించాలన్నారు. ఆటో సోదరులు ధైర్యంగా ఉండాలని, తొందరపాటు చర్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆటో నడవటం లేదని మనస్తాపంతో, బతుకు భారమై భార్యతో సహా, ప్రాణాలు కోల్పోయిన ఆటో సోదరుడి హృదయ విదారక ఘటన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కదిలించకపోవడం బాధాకరం. తల్లి, తండ్రిని కోల్పోయి, అనాధగా మారిన ఆ బిడ్డ భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారు. ఎవరు భరోసా ఇస్తారు. నిజామాబాద్ లో జరిగిన ఈ ఘటన పై… pic.twitter.com/88J9n6bpNp
— Harish Rao Thanneeru (@BRSHarish) March 14, 2024