Telangana | ప్రస్తుత యాసంగి సీజన్లో రైతులు పండించిన వరిధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినిపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలను తూతూ మంత్రంగా మాత్రమే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, స్థానిక నాయకులతో కలసి కొప్పుల ఈశ్వర్.. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను ఏర్పాటు చేయడం లేదని విమర్శించారు. తద్వారా పలువురు రైతులు ప్రైవేటు డీలర్లను, నేరుగా రైస్మిల్లర్లకు అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. బోనస్ మాట దేవుడెరుగు.. కనీసం మద్దతు ధరనైనా రైతులకు దక్కేలా కొనుగోలు కేంద్రాల్లో త్వరితగతిన ధాన్యం తూకం వేయాలని డిమాండ్ చేశారు.