హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ‘మోదీ.. బీజేపీలో కుటుంబ పాలన కనిపించడం లేదా? అమిత్షా కుమారుడు ఏం చేస్తున్నారో మీకు తెలియదా? కేంద్ర మం త్రుల పిల్లలు బాధ్యతల్లో ఉన్నారని తెలియ దా?’ అని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రధానిని ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, హరీశ్రావు తెలంగాణ ఉద్యమంలో నుంచి పుట్టారని, బీజేపీ నేతల పిల్లల్లా వారసత్వంతో పదవుల్లోకి రాలేదని స్పష్టంచేశారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల క్యాంపు కార్యాలయంలో వినోద్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఉన్న రాష్ర్టాలకు మోదీ పదేపదే వెళ్తూ హామీల వర్షం కురిపిస్తారని, ఈ ఏడాది ఎన్నికలు ఉన్న తెలంగాణపై వరాల జల్లు కురిపిస్తారని ప్రజలు ఆశించారని, మోదీ మాత్రం గుండు సున్నా చూపించి వెళ్లిపోయారని చెప్పారు. మోదీ ప్రసంగం.. ‘మూడు మోసాలు – ఆరు అబద్ధాలు’ అన్నట్టు సాగిందని ఎద్దేవాచేశారు. కేంద్రం ఏ నిధులు ఇస్తున్నదని, రాష్ట్రం అవినీతి చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన హామీలు నెరవేర్చాలని సీఎం కేసీఆర్ సహా అందరం అనేకసార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనీసం స్పందించలేదని ఆరోపించారు.
వందసార్లు అడిగినం.. ఒక్కసారీ స్పందించలే
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచే మోదీకి రాష్ట్రంపై అక్కసు ఉన్నదని వినోద్కుమార్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రపంచమం తా కీర్తించిందని, కేంద్రం మాత్రం నయాపైసా ఇవ్వలేదని గుర్తుచేశారు. కాళేశ్వరం, పాలమూ రు -రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని రాష్ట్రం అడిగింది నిజం కాదా? అని ప్రశ్నించారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారుల గురించి అడిగి నోళ్లు నొప్పిలేసినయ్ తప్ప.. కేంద్రం ఏనాడూ స్పందించలేదని ఆరోపించారు. హైదరాబాద్-కరీంనగర్ రైల్వేలైన్ పనులు వేగంగా సాగుతున్నాయని మోదీ చెప్పారని, దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని, భూసేకరణను, రైల్వే లైన్ నిర్మాణ ఖర్చులో 1/3 వంతు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నదని పేర్కొన్నారు. ఐదేండ్లుగా 14 జాతీయ రహదారులు పెండింగ్లో ఉన్నాయని, నితిన్ గడ్కరీని అడిగితే ప్రాసెస్ చేశానని, ప్రధాని కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయని నిస్సహాయతను వ్యక్తం చేసినట్టు గుర్తుచేశారు. తెలంగాణకు జాతీయ రహదారులు ఇక్కడి ప్రజల హక్కని.. మోదీ కనికరంతోనో, విశాల హృదయంతోనో ఇచ్చినవి కావని స్పష్టంచేశారు.
బీజేపీలో కుటుంబ పాలనకే పెద్దపీట
దేశంలో ఏ మూలకు వెళ్లినా కుటుం బ పాలన గురించే మోదీ మాట్లాడుతున్నారని, బీజేపీలో సాగేదంతా కుటుంబ పాలనే కదా? అని వినోద్ నిలదీశారు. బీజేపీ కీలక నేత అమిత్షా కుమారుడు బీసీసీఐ అధ్యక్షుడు కాదా? ఆ పదవి బీజేపీని అడ్డం పెట్టుకుని బలవంతంగా లాక్కున్నది కాదా? రాజ్నాథ్సింగ్ కొడుకు ఎమ్మెల్యే, ఫడ్నవీస్ తండ్రి బీజేపీ ఎమ్మె ల్సీ, అనురాగ్ ఠాకూర్ తండ్రి బీజేపీ మాజీ సీఎం, పీయూష్ గోయల్ తండ్రి బీజేపీ ఎంపీ, ధర్మేంద్ర ప్రధాన్ తండ్రి బీజేపీ నేత.. ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీలో వారసత్వ రాజకీయాలకు కొదవలేదన్నారు. కేటీఆర్, కవిత, హరీశ్రావు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు.