వెల్గటూర్(జగిత్యాల) : జిల్లాలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాలలో సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) సమక్షంలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJp)లకు చెందిన నాయకులు,కార్యకర్తలు చేరడంతో వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
రాజారాంపల్లి గ్రామానికి చెందిని యాదవ హక్కుల కమిటీ జిల్లా కార్యదర్శి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మ్యాకల సంతోష్ ఆధ్వర్యంలో 170 మంది బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన సంగం రమేశ్ యాదవ్, మొగిలి జంపయ్య, వార్డు సభ్యుడు ఇందూర్తి లింగమ్మ, మంతెన భూమయ్య, గౌడ సంఘానికి చెందిన పొడేటి సత్తయ్య, బీజేపీ నాయకులు మంతెన సురేష్, రజక సంఘం, ముదిరాజ్ సంఘం నాయకులు మంత్రి సమీక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి కొప్పుల ఈశ్వర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నట్లు గ్రామ వాసులు తెలిపారు.