హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): టీవీ చానళ్లలో బీఆర్ఎస్తోపాటు సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ప్రకటనలను నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మీడియా సర్టిఫికేషన్ మోడల్ కోడ్ (ఎంసీఎంసీ) నుంచి అనుమతి తీసుకోకుండా అభ్యంతరకరమైన రీతిలో ఈ ప్రకటనలను రూపొందించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్కు వివరించారు. ఆ ప్రకటనలు ఎన్నికల నియామవళికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ ఫిర్యాదుతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన అధికారిక ఫేస్బుక్ పేజీ నుంచి కొన్ని ప్రకటలను తొలగించినప్పటికీ టీవీ చానళ్లలో ఇంకా ప్రసారం అవుతున్నాయని తెలిపారు. వాటిని కూడా వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించింది. ఎంసీఎంసీ అనుమతి లేకుండా రూపొందించిన ప్రకటనల ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.
ఎంసీఎంసీ అనుమతి లేకుండా రాజకీయ పార్టీలు మీడియాలో రాజకీయ ప్రకటనలు చేయడానికి విల్లేదని అడిషనల్ సీఈవో లోకేశ్కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన న్యూస్ చానళ్లకు లేఖ రాశారు. కాంగ్రెస్ రూపొందించిన ప్రకటనలను ఆ లేఖకు జత చేశారు.