హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై బీఆర్ఎస్ బ్యానర్ను ఆ పార్టీ నేతలు ప్రదర్శించారు. శుక్రవారం తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గాలిగోపురం వద్ద బీఆర్ఎస్ బ్యానర్ ప్రదర్శించారు.
ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత కోమల్ల రవి ముదిరాజ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ త్వరలో ఏపీలో పర్యటిస్తారన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సీ సంజయ్, అశోక్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.