KTR | హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలను తమ పార్టీలో చేర్చుకోవడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదానికి, ఆచరిస్తున్నదానికి పొంతన లేదని ఎక్స్ వేదికగా దుమ్మెత్తిపోశారు.
ఓ పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు పడేలా చట్ట సవరణ చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని కానీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఏకంగా ఎంపీ టికెట్ కేటాయించి తన ద్వంద్వనీతిని బయటపెట్టుకున్నదని మండిపడ్డారు. మరో ఎమ్మెల్యేకు కాంగ్రెస్ కండు వా కప్పి పార్టీలో చేర్చుకున్నదని విమర్శించారు. గెలిచేంత వరకు ఒకమాట, గెలిచాక ఇంకోమాట.. ఇదే కాంగ్రెస్ రీతి, నీతి అని ఆగ్రహం వ్యక్తంచేశారు.