హైదరాబాద్, జనవరరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసి తమిళిసై గవర్నర్ పదవికి కళంకం తెచ్చారని ఎమ్మెల్సీలు టీ భానుప్రసాద్ రావు, కూచుకుంట్ల దామోదర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వారు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. గణతంత్ర వేడుకల సందర్భంగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుసంధానకర్తగా గవర్నర్ ఉండాలని, కానీ, దేశంలోని కొందరు ఆ పదవికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వీరి వల్ల గవర్నర్ వ్యవస్థ అవసరమా? అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్నదని చెప్పారు. ఆమె బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పర్యటిస్తే తెలంగాణ ఎంత గొప్ప అభివృద్ధి సాధించిందో అర్థమవుతుందని చెప్పారు. రాజ్భవన్లో నిర్వహించిన ఎట్హోంకు తమకు ఆహ్వానం అందలేదని చెప్పారు. అక్కడ అందరూ బీజేపీ నాయకులే కనిపించారని, అది రాజ్భవనా? బీజేపీ కార్యాలయమా? అని అనుమానం వచ్చిందని పేర్కొన్నారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టిస్తున్నదని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగేతర శక్తులుగా ఎదగాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే గవర్నర్ పదవి నుంచి తప్పుకొని, ఎన్నికల్లో పోటీ చేయాలని సూచించారు. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న దాదాపు అన్ని రాష్ర్టాల్లో గవర్నర్ల పని తీరు సరిగా లేదని చెప్పారు.
రాష్ట్ర గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి హాస్యాస్పదంగా ఉన్నది. ఆమె తన స్థాయిని మరిచి బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక గవర్నర్ పక్క రాష్ట్రానికి వెళ్లి తెలంగాణపై ఆరోపణలు చేస్తున్నారు. రాజ్భవన్ను రాజకీయ భవన్లా మార్చారు.
– ఎంపీ లింగయ్య, ఎమ్మెల్యే సైదిరెడ్డి
గవర్నర్ తమిళిసై తనస్థాయి దిగజారి బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు. ప్రజా జీవితంలో తిరసరణకు గురైన తమిళిసై, స్థాయి మరచి మాట్లాడటం బాధాకరం.
– కే వాసుదేవరెడ్డి, రాష్ట్ర వికలాంగుల
రాష్ర్ట గవర్నర్ ఆ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అవిశ్వాస తీర్మానం పెట్టే గడువును మూడేండ్ల నుంచి నాలుగేండ్లకు పెంచుతూ శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ వద్దే పెట్టుకొన్నా రు. తెలంగాణ అభివృద్ధి అడ్డుకొంటూ తన రాజకీయ ఎజెండాను అమలు చేస్తున్నారు.
-వెన్రెడ్డి రాజు, మునిసిపల్ చైర్మన్ చాంబర్స్ అధ్యక్షుడు