KCR | హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ ఎమ్మెల్యే కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర శాసనసభ్యుడిగా ప్రమా ణం చేయనున్నట్టు తెలిసింది. 2023 నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కే చంద్రశేఖర్రావు భారీ మెజారిటీతో గెలుపొందారు.
ఆ తర్వాత ఆయన నివాసంలో జారి పడటం తుంటి ఎముక విరగడం, ఆపరేషన్ కావడం, డాక్టర్ల సూచన మేరకు ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. త్వరలోనే పూర్తిస్థాయిలో కొలుకొని ఫిబ్రవరి ఒకటిన ఎమ్మెల్యేగా ప్రమా ణం చేస్తారని తెలిసింది. ప్రమాణం తేదీ శనివారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.