KCR | రంగారెడ్డి : ఈ నెల 14వ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభా వేదికపై అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. చేవెళ్ల వేదిక నుంచి కేసీఆర్ లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
చేవెళ్ల సభ ప్రాంగణానికి చేరుకున్న గులాబీ బాస్ కేసీఆర్ pic.twitter.com/oOGVjJIWxX
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2024