హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆదర్శాలు, కార్యాచరణ సంపూర్ణంగా అమలులోకి వచ్చిననాడే, దేశ స్వాతంత్య్రానికి సంపూర్ణ ఫలితం దకినట్టని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. అంబేదర్ జయంతి సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలు, త్యాగాలను కేసీఆర్ స్మరించుకున్నారు.
దళిత, బహుజన కులాలను అన్ని రంగాల్లో అగ్ర కులాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే అంబేదర్ ఆశయాలను గడచిన తమ పదేండ్ల ప్రగతి పాలనలో నిజం చేసి చూపించామని కేసీఆర్ పేర్కొన్నా రు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగంగా కొనసాగిందని పేరొన్నారు. రాజ్యాంగంలో అంబేదర్ పొందుపరిచిన ఆర్టికల్-3 ద్వారానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని గుర్తుచేశారు. అందుకు కృతజ్ఞతగా తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ సచివాలయంగా పేరు పెట్టుకున్నామని తెలిపారు.