KCR | హైదరాబాద్ : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తండ్రి సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హరీశ్రావు నివాసానికి చేరుకున్నారు. తన బావ సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. భర్తను కోల్పోయిన అక్క లక్ష్మమ్మకు కేసీఆర్ ధైర్యం చెప్పారు. ఇక హరీశ్రావును గుండెలకు హత్తుకుని కేసీఆర్ ఓదార్చారు.
తన బావతో (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ భర్త) తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృతి పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సమాచారం తెలిసిన వెంటనే హరీశ్ రావును ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.