జగిత్యాల, మార్చి 29: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తండ్రి, సీనియర్ న్యాయవాది హనుమంతరావు (85) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం పట్టణంలోని హౌసింగ్బోర్డు కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హనుమంతరావు న్యాయవాదిగా పనిచేశారు. ఆయనకు కొడుకులు డాక్టర్ సంజయ్, సందీప్కుమార్, కూతురు రజిత ఉన్నారు. రాత్రి 10 గంటలకు మోతె శ్మశానవాటిక (శంకర్ఘాట్)లో అంత్యక్రియలు నిర్వహించారు.
హనుమంతరావు మృతికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విచారకరమని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సంతాపం ప్రకటించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.