జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తండ్రి హనుమంతరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం తెలిపారు. సంజయ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హనుమంతరావు ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. అలాగే సంజయ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ న్యాయవాది హనుమంతరావు శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు. హనుమంతరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యాయవాదిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కొడుకులు డాక్టర్ సంజయ్కుమార్, సందీప్ కుమార్, కుమార్తె రజిత ఉన్నారు.