KCR | దేవరకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ తండ్రి రమావత్ కనీలాల్ నాయక్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఇంటిపెద్దను కోల్పోయి శోక తప్త హృదయులైన రవీంద్ర కుమార్ నాయక్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆదివారం నాడు రత్యానాయక్ తండాలో కనీలాల్ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రత్యానాయక్ తండాకు వెళ్లి కనీలాల్ పార్థివ దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా, దివంగత కనీలాల్ నాయక్, ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ పొందారు. అనంతరం దేవరకొండ మండలంలోని తమ స్వగ్రామం రత్యానాయక్ తండా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రజలకు సేవలందించారు.
దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ తండ్రి కనీలాల్ మరణం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నిమ్స్లో కనీలాల్ పార్థివ దేహాన్ని శనివారం సందర్శించి.. నివాళులర్పించారు.