KCR | హైదరాబాద్ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోంది. మొన్న హేమంత్ సోరెన్, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్ ఘటనలే నిదర్శనం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ సహా దర్యాప్తు సంస్థలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న కేంద్రం చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమైన అరెస్ట్. అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్… pic.twitter.com/UCVs3DX2Pd
— BRS Party (@BRSparty) March 22, 2024