Telangana Assembly Elections | జహీరాబాద్లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్లలో కౌంటింగ్ కొనసాగింది. ఇందులో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావుకు 2239 ఓట్ల మెజారిటీ లభించింది. ఏడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి 5,960 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 4,627 ఓట్లు, బీఎస్పీకి 302, బీజేపీకి 658 ఓట్లు పోలయ్యాయి.