చెన్నూరు: అసెంబ్లీలో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ (Balka Suman) మంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యక్తలు, నాయకులతో కలిసి చెన్నూరు (Chennur) పట్టణంలోని ఆర్వో కార్యాలయానికి వెళ్లిన సుమన్.. నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా, ఎమ్మెల్యే బాల్క సుమన్ తరఫున రెండో సెట్ నామినేషన్ను మాజీ మంత్రి బోడ జనార్దన్ చెన్నూరు పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయంలో దాఖలు చేశారు. ఆయనవెంట చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రెడ్డి, వైస్ చైర్మన్ భైస ప్రభాకర్, సీనియర్ నాయకులు రిక్కుల మధుకర్, రామ్ లాల్ ఉన్నారు.
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు చెన్నూరు పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగింది. pic.twitter.com/je811oiTBK
— Balka Suman (@balkasumantrs) November 9, 2023
చెన్నూరు పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయంలో నా తరపున రెండో సెట్ నామినేషన్ దాఖలు చేసిన మాజీమంత్రి బోడ జనార్దన్ గారు. వారి వెంట చెన్నూరు మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ భైస ప్రభాకర్ గారు, సీనియర్ నాయకులు రిక్కుల మధుకర్ గారు, రామ్ లాల్ గారు పాల్గొన్నారు. pic.twitter.com/2S4nNDZX4r
— Balka Suman (@balkasumantrs) November 9, 2023