హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో నిర్మిస్తున్న భారత రాష్ట్ర సమితి కార్యాలయ నిర్మాణ పనులను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పరిశీలించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ చేరుకున్న ఆయన, వసంత్ విహార్లో జరుగుతున్న కార్యాలయ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. పనులు తుది దశకు చేరుకున్నాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గడువులోగా పనులు పూర్తి కావాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి ఆదేశించారు.