హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా కేశవరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి ప్రసంగంలో దేశంలోని ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావనే లేదని విమర్శించారు. దేశంలో ఆశ్రిత పక్షపాతం నడుస్తున్నదని, ప్రజల సొమ్మును బడా వ్యాపారవేత్తలకు కట్టబెట్టేవిధంగా పాలిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం ప్రభుత్వం మెచ్చిన బిజినెస్ మాగ్నెట్ గౌతమ్ అదానీ పేరుతో అదానీ చట్టం తీసుకొస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని కేకే స్పష్టం చేశారు. కేవలం నరేంద్రమోదీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడానికే తాము రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిషరించాల్సి వచ్చిందని పేరొన్నారు. బీఆర్ఎస్కు చెందిన 16 మంది, ఆప్కు చెందిన 10 మంది ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి నిరసన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొట్టి, డాంబికాలు పలుకుతున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామానాగేశ్వర్రావు అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అభివృద్ధి గురించి కానీ, రైతుల ప్రయోజనాలు గురించి కానీ ఎకడా ప్రస్తావించలేదని మండిపడ్డారు. దేశం గర్వించే విధంగా తెలంగాణలో అభివృద్ధి పథకాలు అమలు అవుతున్నాయని చెప్పారు. కేంద్రం ఏ ఒక పథకానికి పైసా ఇవ్వకపోయినా తమ నాయకుడు కేసీఆర్ రాష్ట్ర నిధులు వెచ్చించి, అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ తరఫున తాము లేవనెత్తిన ఏ ఒక అంశాన్ని రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించకపోవడం కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ వైఖరికి నిదర్శనమని ధ్వజమెత్తారు. తాము లేవనెత్తిన రిజర్వేషన్ బిల్లుల గురించి కూడా ఎకడా లేదన్నారు. ‘అంబేదర్ గురించి మాట్లాడారు.. కానీ మేము నూతన పార్లమెంట్ భవనానికి అంబేదర్ పేరు పెట్టాలని కోరాం. ఆ సంగతేం చేశారు’ అని ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ అంబేదర్ పేరు పెట్టారు, అలాగే పార్లమెంట్ నూతన భవనానికి కూడా ఆ మహానాయకుడి పేరు పెట్టి, కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రైతు పండించిన ప్రతి పంటకు ఇచ్చే కనీస మద్దతు ధరకు చట్ట బద్ధత కల్పించాలని, వ్యవసాయ చట్టాలపై నిరసన సందర్భంగా రైతులపై పెట్టిన అన్ని రకాల కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ‘ఇంటింటికి తాగు నీరిచ్చామంటున్నారు.. ఎకడ.. ఎవరు, ఎప్పుడు ఇచ్చారో ప్రజలకు తెలియంది కాదు’ అన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన తాగు నీరందించిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని నామా స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా రైతుబంధు అమలు చేయాలని కోరినా రాష్ట్రపతి ప్రసంగంలో ఎకడా ప్రస్తావించలేదని చెప్పారు. తెలంగాణకు ఒక మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా కేసీఆర్ రాష్ట్ర నిధులతో జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి, విద్య, వైద్య రంగాన్ని దేశంలోనే అగ్రగామిగా చేశారని చెప్పారు. విభజన హామీలు తుంగలో తొకారని మండిపడ్డారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలను లేవనెత్తి, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పెద్ద ఎత్తున ఎండగడతామని నామా స్పష్టం చేశారు. నిరుద్యోగం, ధరలు పెరుగుదల, మహిళా రిజర్వేషన్ బిల్లు, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత, రైతుల ఆదాయం రెట్టింపు తదితర అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించి, కేంద్రం బండారాన్ని దేశ ప్రజలముందు ఉంచుతామని, ఈ విషయంలో కేంద్రాన్ని వదిలే ప్రసక్తేలేదని నామా స్పష్టంచేశారు.