ఇబ్రహీంపట్నం, మార్చి 25 : భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ బీఆర్ఎస్ నేతల మద్దతు కూడగడుతున్నారు. ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, జనగామ తదితర నియోజకవర్గాల్లో ముఖ్యనాయకులను వరుసగా కలుస్తున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి స్వగ్రామమైన ఎలిమినేడుకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే బీఆర్ఎస్ సునాయాసంగా గెలుస్తుందని, నాయకులంతా సమిష్టిగా కృషి చేయాలని కోరారు. సోమవారం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని కలుసుకున్నారు. భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉందని, ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు రావాలని మల్లేశ్ కోరారు.