హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే ముందున్నది. ఎలాగైనా అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తున్న పార్టీ.. పార్లమెంటు నియోజకవర్గాలకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నది. ఇందులో భాగంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు ఏడుగురు సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నియమించారు.