యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి(Lakshmi Narasimha Swamy) వారి అలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు( Brahmotsavam) వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి అలంకార, వాహన సేవలు నిర్వహించారు. ఉదయం 9గంటలకు మత్స్యావతార అలంకార సేవ, వేదపారాయణం రాత్రి 7గంటలకు శేష వాహన సేవలు కొనసాగనున్నాయి. కాగా, ఆలయ మహా ఉద్ఘాటన తర్వాత రెండోసారి బ్రహోత్సవాలు జరుగుతుండగా, ఈ నెల 21 వేడుకలు కొనసాగనున్నాయి.