Yadagiri Gutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు గురువారం పరిపూర్ణమయ్యాయి. ఉదయం విశ్వక్సేన, పుణ్యాహవచనం, హవన పూజలు చేసి పూర్ణాహుతి జరిపారు. లక్ష్మీనరసింహస్వామిని 108 కలశాలతో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అభిషేకించారు.
గర్భాలయంలోని స్వయంభూమూర్తులు, సువర్ణ ప్రతిష్ఠామూర్తులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేక పూజలు వైభవంగా నిర్వహించారు. రాత్రి కల్యాణమూర్తులు లక్ష్మీనరసింహస్వామిని పట్టుపీతంబరాలు, ముత్యాలు, రత్నాల ఆభరణాలు, వివిధ రకాల పూలతో దివ్యమనోహరంగా అలంకరించి డోలికలో అధిష్ఠింపజేశారు.
– యాదగిరిగుట్ట