హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయ పథకం (బెస్ట్) దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు పరిషత్తు పాలనాధికారి యూ రఘురాం శర్మ తెలిపారు.
వివిధ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు చేసుకోనివారి సౌకర్యార్థం గడువును పొడిగించినట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాలకు అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాల కోసం www.brahminparishad .telangana.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చని ఆయన తెలిపారు.